ఏపీలో కొత్తగా 3,967 కేసులు..24 మంది మృతి

ఏపీలో కొత్తగా 3,967 కేసులు..24 మంది మృతి

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,967 కరోనా కేసులు నమోదయ్యాయని కరోనా హెల్త్ బులెటిన్ లో తెలిపింది రాష్ట్ర ఆరోగ్యశాఖ.  కొత్తగా నమోదైన కేసులతో .. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,75,470కి చేరాయని.. గడిచిన 24 గంటల్లో కరోనాతో 24 మంది మృతి చెందారని చెప్పింది. కొత్త మరణాలతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,382 మంది వైరస్ తో చనిపోయారని తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 38,979 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,30,109 కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది వైద్యారోగ్యశాఖ.

జిల్లాల వారీగా కరోనా రిపోర్ట్: