కాలువలో పడ్డ బస్సు.. 45కి చేరిన మృతుల సంఖ్య

కాలువలో పడ్డ బస్సు.. 45కి చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి కాలువ‌లో పడిపోయిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 45 కి చేరింది. ఈ ఘటనలో గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. మంగ‌ళ‌వారం ఉదయం 8.30 గంటల సమయంలో బ‌స్సు సిధి నుండి ప‌ట్నా అనే గ్రామం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో 24 మంది పురుషులు, 20 మంది మ‌హిళ‌లు, ఒక‌ చిన్నారి మృతి చెందారు. ప్ర‌మాదం జరిగిన కాలువ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 18 మంది మృత‌దేహాల‌ను వెలికి తీసిన స‌హ‌య‌క సిబ్బంది.. నీటిలో గల్లంతైన మిగ‌తావారి కోసం గాలిస్తున్నారు.

ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.5 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప్ర‌మాదంపై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు త‌మ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.