రాష్ట్రంలో 47 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్త సోమవారం(మార్చి 4) ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టారు. గత నెల 12 నుంచి ఈ బదిలీల పర్వం కొనసాగుతోంది.