మహారాష్ట్రలో 48 వాహనాలను ఢీ కొట్టిన ట్యాంకర్

మహారాష్ట్రలో 48 వాహనాలను ఢీ కొట్టిన ట్యాంకర్

పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె – బెంగళూరు నేషనల్ హైవేపై ఉన్న నావల్ బ్రిడ్జ్పై వేగంగా దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్ పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 48 కార్లు దెబ్బతిన్నాయి. వాహనాలు ఒకదానికొకటి  ఢీకొట్టుకోవడంతో భారీగా డ్యామేజ్ జరిగింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో ట్యాంకర్ నుంచి ఆయిల్ కిందపడటంతో వాహనాలు గ్రిప్ మిస్ అయ్యి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నావెల్ బ్రిడ్జి యాక్సిడెంట్ స్పాట్గా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి బ్రిడ్జిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.