ఏపీలో 502కు చేరిన కరోనా కేసులు

ఏపీలో 502కు చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ మరో  19 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా పశ్చిమగోదావరిలో 8, కర్నూలులో 6, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 502కు చేరింది. ఇందులో 16 మంది డిశ్చార్జ్ అవ్వగా..11 మంది చనిపోయారు. అత్యధికంగా గుంటూరులో  118, కర్నూలు జిల్లాలో 97, నెల్లూరు 56, ప్రకాశం 42,కృష్ణా జిల్లాలో 45 , ప్రకాశం 42 ,కడపలో 33 కేసులు నమోదయ్యాయి.