దేశంలో కొత్తగా 55 వేల కరోనా కేసులు.. 876 మంది మృతి

దేశంలో కొత్తగా 55 వేల కరోనా కేసులు.. 876 మంది మృతి

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.తాజాగా 55,079 కరోనా కేసులు న‌మోద‌య్యయని కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,02,743కు చేరుకుంది. ఇందులో 19,77,780 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మ‌రో 6,73,166 కేసులు యాక్టివ్‌గా ఉన్న‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల సోమవారం 876 మంది మ‌ర‌ణించారు. దాంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మరణించిన వారిసంఖ్య 51,797కు చేరింది. నిన్నటివరకు దేశంలో 3,09,41,264 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. కాగా.. నిన్న ఒక్కరోజే 8,99,864 శాంపిళ్లను టెస్ట్ చేసినట్లు తెలిపింది.

For More News..

‘ఆదిపురుష్’ గా ప్రభాస్

చెరువుల రక్షణకు ఏం చేస్తున్నరు?

ఎస్పీ బాలు కోలుకోవాలంటూ రజనీ కాంత్ వీడియో