ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. జౌన్ పూర్ లో ఓ ట్రక్కు, కారును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
 ఈ ప్రమాదం మార్చి 10వ తేదీ ఆదివారం తెల్లవారుజామున గౌరా బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్జాగ్-కెరకట్ రహదారిపై జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రులను చికిత్స కోసం వారణాసి ఆస్పత్రికి తరలించారు. కారు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తుండగా.. వేగంగా దూసుకొచ్చి ట్రక్కు ఢీకొట్టిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అజయ్ పాల్ శర్మ తెలిపారు. మృతులను బీహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందిన గజ్ధర్ శర్మ (60), అతని కుమారుడు అనిష్ శర్మ (35)..  జవహర్ శర్మ (57), అతని 17 ఏళ్ల కుమారుడు, సోనమ్ (34), రింకు (32)గా గుర్తించినట్లు చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.