24 గంటల్లో 66,732 కేసులు..816 మంది మృతి

24 గంటల్లో 66,732 కేసులు..816 మంది మృతి

దేశంలో కరోనా కేసుల సంఖ్య 71 లక్షలు దాటాయి. నిన్న 66,732 కేసులు నమోదవడంతో  కరోనా కేసుల సంఖ్య దేశంలో 71,20,539 కు చేరింది. నిన్న 816 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 1,09,150 కు చేరింది. నిన్న ఒక్కరోజే 71,559 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నిన్నటి వరకు 61,49,536 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 8,61,853 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.. నిన్న ఒక్కరోజే 9,94,851 శాంపిల్స్ పరీక్షించారు. వీటితో కలిపి దేశంలో అక్టోబర్ 11 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 8,78,72,093 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

తెలంగాణలో కొత్తగా 1201 కేసులు.. 6 మంది మృతి

అమ్మాయిలకు ఇంటర్ పాస్ ఐతే రూ.25 వేలు.. డిగ్రీ పాస్ ఐతే రూ.50 వేలు