రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు

దేశంలో  కరోనాకు ఇంకా ఫుల్ స్టాప్ పడడం లేదు. అయితే.. గతంలో కన్నా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 69 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన24 గంటల్లో 65 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి 8, 34, 413 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి  ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.44 శాతంగా ఉందని, మొత్తం 7 వేల 926  టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది. 

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : 
ఆదిలాబాద్ 01, భద్రాద్రి కొత్తగూడెం 0, హైదరాబాద్ లో 46, జగిత్యాల 0, జనగాం 0, జయశంకర్ భూపాలపల్లి 0, జోగులాంబ గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 01, ఖమ్మం 0, కొమరంభీం ఆసిఫాబాద్ 0, మహబూబ్ నగర్ 0, మహబూబాబాద్ 02, మంచిర్యాల 01, మెదక్ 01,  మేడ్చల్ మల్కాజ్ గిరి 01, ములుగు 0, నాగర్ కర్నూలు 0, నల్గొండ రెండు కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 01, పెద్దపల్లి 01, రాజన్న సిరిసిల్ల 01, రంగారెడ్డి 04, సంగారెడ్డి 02, సిద్ధిపేట 0, సూర్యాపేట 0, వికారాబాద్ 01, వనపర్తి 01, వరంగల్ రూరల్ 0, హన్మకొండ మూడు కేసులు వచ్చాయి.