కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి సమక్షంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్కు చెందిన బీఆర్ఎస్సర్పంచ్సెగ్యం వెంకటేశ్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం హైదరాబాద్లో సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్లీడర్లు మంత్రిని కలిశారు.ఈ సందర్భంగా సర్పంచ్వెంకటేశ్తోపాటు వార్డు సభ్యులకు మంత్రి వివేక్కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్సర్కార్, మంత్రి వివేక్వెంకటస్వామి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై కాంగ్రెస్లో చేరినట్లు సర్పంచ్తెలిపారు. పోన్నారం సర్పంచ్పెంచాల మధు, లీడర్లు నీలయ్య, గందె రాంచందర్తదితరులున్నారు.
