ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వయసులో భార్యను హత్య చేసి తనూ ఉరేసుకున్నాడో వృద్ధుడు. యాదాద్రి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొర్న సూరయ్య(70), కొర్న మాణిక్యమ్మ(60) భార్యాభర్తలు. వారికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మాణిక్యమ్మ అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా చేస్తోంది. కొన్ని నెలలుగా సూరయ్య మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె నెల రోజులుగా గ్రామంలోనే తన ఇద్దరు కుమారుల వద్ద ఉంటోంది. భార్య తనకు డబ్బులు ఇవ్వడం లేదని, మాట వినడం లేదని కక్ష పెంచుకున్న సూరయ్య శుక్రవారం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాడు. భార్య కత్తితో తలపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మాణిక్యమ్మ అరుపులతో గ్రామస్థులు అక్కడికి చేరుకునేలోగానే సూరయ్య పరారయ్యాడు. ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.