వెలుగు రిపోర్టర్ బిడ్డకు 739వ ర్యాంక్

వెలుగు రిపోర్టర్ బిడ్డకు 739వ ర్యాంక్

 కరీంనగర్ లోని విద్యానగర్  కు చెందిన  కొలనుపాక సహన సివిల్స్ లో 739వ ర్యాంకు సాధించారు. ఆమె తల్లి గీత హౌస్ వైఫ్ కాగా, తండ్రి అనిల్ జయశంకర్ వెలుగు పత్రికకు కరీంనగర్ టౌన్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. సహన స్థానిక  కెన్ క్రెస్ట్ స్కూల్ లో  టెన్త్ , శ్రీగాయత్రి  జూనియర్ కాలేజీలో ఇంటర్, హైదరాబాద్ లోని జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. తర్వాత ఢిల్లీలో యూపీఎస్ సీ కోచింగ్ తీసుకున్నారు. 

 ప్రిలిమినరీ, మెయిన్స్ ఫలితాల్లో క్వాలిఫై అయ్యాక ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూలకు అటెండయ్యారు. కరీంనగర్ కలెక్టర్ గా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ స్ఫూర్తితో కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నట్లు సహన తెలిపారు. అయితే, తనకు వచ్చిన ర్యాంకుకు ఐఏఎస్ కాకుండా మరొక సర్వీస్ లో జాబ్ వస్తుందని, అందులో జాయిన్ అయ్యాక మళ్లీ ఐఏఎస్ సాధించేందుకు పరీక్ష రాస్తానన్నారు.