
7హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్
హైదరాబాద్ : 7 హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్ ను వీ6 క్రికెట్ టీమ్ గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేసింది. దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సోమవారం జరిగిన ఫస్ట్ మ్ యాచ్లో వీ6 టీమ్ 63 రన్స్ తేడాతో డెక్కన్ క్రానికల్ ను ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వీ6 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది. ఓపెనర్ సదానందం (36 బాల్స్ లో 8 ఫోర్లు, 1 సిక్ స్ తో 51) హాఫ్ సెం చరీ చేయగా.. శ్రావణ్ (40) రాణించాడు. అనంతరం ఛేజింగ్ లో డెక్కన్ క్రానికల్ 16.4 ఓవర్లలో 91 రన్స్ కే ఆలౌటైంది. వీ6 బౌలర్లలో
ప్రేమ్ కుమార్ (2/30), శ్రీకాంత్రెడ్డి (2/14), ఎండీ మదార్(2/14) రా ణించా రు. ప్రేమ్ కుమార్కు బెస్ట్ బౌలర్ , సదానందంకు ప్లేయర్ ఆఫ్ ద మ్ యాచ్ అవార్డులను టీఆర్ ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి , టోర్నీ స్పాన్సర్ , నంది టైర్స్ ఎండీ భరత్ రెడ్డి అందించారు. అంతకుముందు ఎంఎల్ఆర్ఐటీ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు.