కుషాయిగూడ, వెలుగు: ఎనిమిదేళ్ల బాలికను కిడ్నాప్చేసేందుకు యత్నించిన వ్యక్తికి ఎల్బీనగర్కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. కాప్రా, బంజారా కాలనీలో ఉండే ఎనిమిదేళ్ల బాలిక 2011 నవంబర్ 20న స్థానిక కిరాణా షాపుకు వెళ్లింది. కాప్రాలో ఉండే బండారి బాల్రాజ్(20) బాలికకు చాక్లెట్ఇచ్చి సైకిల్పై దమ్మాయిగూడ వైపు తీసుకెళ్లాడు. గమనించిన యువతి తండ్రి శ్రీనివాస్నాయక్వెంబడించి అడ్డుకున్నాడు.
బాలికను వదిలేసి బాల్రాజ్పారిపోయాడు. అనంతరం శ్రీనివాస్కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం చార్జ్షీట్ ను కోర్టుకు అందించారు. సోమవారం కేసు వివరాలను పరిశీలించిన కోర్టు 8 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.