చాక్లెట్​ఇచ్చి కిడ్నప్‌కి యత్నం : 8 నెలల జైలు శిక్ష

చాక్లెట్​ఇచ్చి కిడ్నప్‌కి యత్నం : 8 నెలల జైలు శిక్ష

కుషాయిగూడ, వెలుగు: ఎనిమిదేళ్ల బాలికను కిడ్నాప్​చేసేందుకు యత్నించిన వ్యక్తికి ఎల్బీనగర్​కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. కుషాయిగూడ ఇన్​స్పెక్టర్ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. కాప్రా, బంజారా కాలనీలో ఉండే ఎనిమిదేళ్ల బాలిక 2011 నవంబర్​ 20న స్థానిక కిరాణా షాపుకు వెళ్లింది. కాప్రాలో ఉండే బండారి బాల్​రాజ్(20) బాలికకు చాక్లెట్​ఇచ్చి సైకిల్​పై దమ్మాయిగూడ వైపు తీసుకెళ్లాడు. గమనించిన యువతి తండ్రి శ్రీనివాస్​నాయక్​వెంబడించి అడ్డుకున్నాడు.

బాలికను వదిలేసి బాల్​రాజ్​పారిపోయాడు. అనంతరం శ్రీనివాస్​కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం చార్జ్​షీట్ ను కోర్టుకు అందించారు. సోమవారం కేసు వివరాలను పరిశీలించిన ​కోర్టు 8 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.