
నాగ్పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆసీస్ 132 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆసీస్ కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయిన ఆసీస్ పలు చెత్త రికార్డులను నమోదు చేసింది. భారత్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఏ ఒక్క ఆసీస్ బ్యాట్స్ మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం ఇదే తొలిసారి. అలాగే రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కలిపి 10 మంది ఆసీస్ ఆటగాళ్లు ఎల్బీగా వెనుదిరగడం కూడా ఇదే తొలిసారి. టెస్టుల్లో ఆసీస్ కు ఇది రెండో అత్యల్ప స్కోరు. 1981లో మెల్బోర్న్లో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 83 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా టెస్టుల్లో ఆసీస్ పై ఇన్నింగ్స్ తేడాతో భారత్ గెలవడం ఇది ఐదోసారి.