
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో జాలిగామ గ్రామంలో 104 వాహనం బీభత్సం సృష్టించింది.. ముగ్గురు వ్యక్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 104 వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని.. 104 వాహనాన్ని ధ్వంసం చేసిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.