గ్రేటర్ సమస్యలపై సిటిజన్స్ మేనిఫెస్టో

గ్రేటర్ సమస్యలపై సిటిజన్స్ మేనిఫెస్టో
  •     4 ఎంపీ స్థానాల పరిధిలో రూపొందించిన రెసిడెంట్​వెల్ఫేర్ అసోసియేషన్స్
  •     ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా పరిష్కరించాలని వినతి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్​సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన సమస్యలను తెలుసుకుని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్(ఆర్​డబ్ల్యూఏ) బుధవారం ‘సిటిజన్స్​మేనిఫెస్టో’ను రిలీజ్​చేసింది. ఏ పార్టీ అభ్యర్థి నెగ్గినా ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఇందులో ప్రధానంగా జీఓ111 అమలు, వరద నీరు పోటెత్తకుండా శాశ్వత పరిష్కారం, రోడ్ల విస్తరణ, కంటోన్మెంట్ విలీనం, ఎంఎంటీఎస్ పొడిగింపు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా, గవర్నమెంట్​హాస్పిటల్స్, స్కూల్స్ లో కనీస వసతులు, డ్రగ్స్, గ్యాంబ్లింగ్, భూ ఆక్రమణలకు అడ్డుకట్ట అంశాలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని 4 వేలకు పైగా ఉన్న రెసిడెంట్​వెల్ఫేర్ అసోషియేషన్లన్నీ కలిసి ఈ మేనిఫెస్టోని తయారుచేశాయి. సిటిజన్స్​మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర నాయకులకు అందజేశామని ఆర్ డబ్ల్యూఏ సెక్రెటరీ టీబీ శ్రీనివాస్ వెల్లడించారు.