తిరుమలలో ఒంటికి నిప్పంటించుకున్న భక్తుడు

తిరుమలలో ఒంటికి నిప్పంటించుకున్న భక్తుడు

తిరుమలలో ఓ భక్తుడు ఒంటికి నిప్పంటించు కోవడం కలకలం రేపింది. అనంతాళ్వార్ తోట వెనుక భాగంలో గుర్తు తెలియని ఓ భక్తుడు పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. నిత్యం భక్తుల రద్దీతో ఉండే ఈ ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో టిటిడి సెక్యూరిటీ భక్తుడిని వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అతని శరీరం 85 శాతానికి పైగా కాలిపోయింది. ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనేది తెలియదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.