శంకర్ పల్లిలో..జొన్న తోటలో గంజాయి సాగు

శంకర్ పల్లిలో..జొన్న తోటలో గంజాయి సాగు

శంకర్ పల్లి, వెలుగు : పొలంలో గంజాయి తోటను సాగు చేసే రైతును అరెస్ట్ చేసి మొక్కలను ఎస్ ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పరిధిలో జరిగింది. రావులపల్లి కలాన్ లో రైతు సుధీర్ జొన్న చేనులో గంజాయి సాగు చేస్తున్నాడు.

సమాచారంతో అందడంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీమ్ బుధవారం సాయంత్రం వెళ్లి దాడి చేశారు. వందల సంఖ్యలో గంజాయి మొక్కలను రైతు పెంచుతున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రైతుపై కేసు నమోదు చేసినట్టు  చేవెళ్ల ఎక్సెజ్ సీఐ శ్రీలత తెలిపారు.