
ప్రమాదవశాత్తు కారు లోయలో పడి ఒకరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. వేల్పూర్ మండలం పోచంపల్లిలో చోటు చేసుకుంది ఈ ఘటన. వ్యవసాయ పొలానికి నీరు పెట్టడానికి వెళ్ళాడు పడగల్ గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు.
ఈ క్రమంలో కారు కాలువలో పడి రమేష్ మృతి చెందారు. లోయలో పడిన కారును గమనించిన స్థానికులు పడవల సాయంతో కారును ఒడ్డుకు లాగి మృతదేహాన్ని కారులో నుండి బయటకు తీశారు. రమేష్ మరణం అతని కుటుంబంలో పెను విషాదం నింపింది.