లారీని ఢీకొట్టిన కార్లు... ఇద్దరి మృతి

లారీని ఢీకొట్టిన కార్లు... ఇద్దరి మృతి

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం 65 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ వైపు ఇనుపలోడ్ తో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి... రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ వైపు వెళ్తున్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టాయి. ఆ కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ... మరో పదిమందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో హైదరాబాద్ వైపు వన్ వేలో ట్రాఫిక్ మళ్లించారు.