రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కూకట్పల్లిలోని కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. కారు ఇంజన్ లో నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో కారు పక్కకు ఆపి ప్రయాణికులు అందులోంచి బయటకు దిగిపోయారు.
వెంటనే స్థానికులు కలగజేసుకుని కారు ఇంజన్ పైకి లేపి అందులో మట్టి పోసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో మంటలు ఎందుకు వచ్చాయో కారణాలు తెలియరాలేదు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.