నాంపల్లిలో అగ్నిప్రమాదం..20లక్షల ఆస్తి నష్టం

నాంపల్లిలో అగ్నిప్రమాదం..20లక్షల ఆస్తి నష్టం

హైదరాబాద్ :  నాంపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ గణేష్ ఏజెన్సీ ఎలక్ట్రానిక్ గోడౌన్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీలు ఉండే గోడౌన్ లో మంటలు చెలరేగి భారీగా పొగలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.20లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.