తనిఖీల్లో భారీగా గోల్డ్, క్యాష్ సీజ్

తనిఖీల్లో భారీగా గోల్డ్, క్యాష్ సీజ్

కూకట్​పల్లి, వెలుగు: ఎన్నికల కోడ్​నేపథ్యంలో గ్రేటర్​పరిధిలో పోలీసుల వెహికల్స్​తనిఖీలు కొనసాగుతున్నాయి. బుధవారం సిటీలో వేర్వేరుచోట్ల రూ.3.16 కోట్ల గోల్డ్, సిల్వర్, క్యాష్​పట్టుకున్నారు. కూకట్​పల్లి పోలీసులు రామ్​దేవ్​రావు హాస్పిటల్​వద్ద జీవీసీ లాజిస్టిక్స్ సంస్థకు చెందిన వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో రూ.2.64 కోట్ల విలువ చేసే గోల్డ్, రూ2.80 లక్షల విలువ చేసే సిల్వర్ దొరికింది.

వాటికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కూకట్​పల్లి సౌత్ ఇండియా షాపింగ్​ మాల్​వద్ద చేపట్టిన తనిఖీల్లో రేడియంట్​ లాజిస్టిక్స్​వెహికల్​లో తరలిస్తున్న రూ.2లక్షల63వేల845 దొరికింది. మేడ్చల్​లో నిర్వహించిన తనిఖీల్లో సిస్కో సేఫ్​ గార్డ్ వెహికల్​లో తరలిస్తున్న రూ. 24లక్షల91వేల700 పట్టుబడింది. బైక్​లపై తరలిస్తున్న రూ.22 లక్షలను బాలానగర్ ఎస్​ఓటీ, బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు.