- షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు
- రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ లో ఘటన
శంషాబాద్, వెలుగు : థర్మాకోల్ కంపెనీలో మంటలు చెలరేగిన ఘటన రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గగన్ పహాడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న రంగోలి థర్మాకోల్ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం వెల్డింగ్ పని జరుగుతుండగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
ఫ్యాక్టరీ చుట్టుపక్కల దట్టమైన పొగ ఆవరించింది. స్థానికులు ఎయిర్పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఫ్యాక్టరీలోని సామగ్రి, మెషినరీ మంటల్లో కాలిపోయింది.