రహమత్ నగర్ లో దారుణం.. చంపి ఫ్రిజ్​లో కుక్కిన్రు

రహమత్ నగర్ లో దారుణం.. చంపి  ఫ్రిజ్​లో కుక్కిన్రు


హైదరాబాద్‌, వెలుగు: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఆ వ్యక్తిని చంపి మృతదేహాన్ని ఫ్రిజ్​లో ఉంచి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్‌లో గురువారం ఈ ఘటన వెలుగు చూసింది. మహమ్మద్ సిద్ధిక్ (35) అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ అపార్ట్​మెంట్​లో టైలరింగ్ పని చేసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో దుండగులు సిద్ధిక్‌ని దారుణంగా హత్యచేసి అతడి ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉంచి వెళ్లిపోయారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్​మెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు​చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.