ఒడిశా టు మహారాష్ట్ర వయా సికింద్రాబాద్

ఒడిశా టు మహారాష్ట్ర వయా సికింద్రాబాద్

సికింద్రాబాద్​, వెలుగు : రైళ్లలో గంజాయి తరలించే అంతర్​ రాష్ర్ట ముఠాలో ఒకరు పట్టుబడ్డారు.  నిందితుడి వద్ద రూ.15.50 లక్షల విలువైన 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సికింద్రాబాద్ ​రైల్వే  అర్బన్​ డీఎస్పీ ఎన్​. జావెద్​ సోమవారం  మీడియాకు వివరాలు తెలిపారు. ఒడిశాలోని  గజపతి జిల్లా లుద్రు గ్రామానికి చెందిన చందకుమార్​ నాయక్(34), మిహిర్, చిందాతో  పాటు మహారాష్ర్టలోని నాందేడ్​కు చెందిన మరో ముగ్గురు ఈజీగా మనీ సంపాదించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఒడిశాలో తక్కువ ధరకు గంజాయిని కొని రైళ్లలో సికింద్రాబాద్​ మీదుగా మహారాష్ట్రకు తరలించి అమ్ముతున్నారు.

సోమవారం ఉదయం  10.30గంటల సమయంలో రైల్వే పోలీసులు స్టేషన్ లో తనిఖీలు చేస్తుండగా ఒడిశా నుంచి వచ్చిన  రైలులోంచి  దిగిన ఓ వ్యక్తి వద్ద లగేజీ అనుమానాస్పదంగా కనిపించింది. ఆపి చెక్ చేయగా.. 2 ట్రాలీ, 3 షోల్డర్​ బ్యాగుల్లో 62 కిలోల గంజాయి లభించింది. చందకుమార్​ నాయక్ ను ​అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించినట్టు డీఎస్పీ జావెద్ తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చేపట్టినట్టు చెప్పారు.