జేబులో సూసైడ్ నోట్: ఉన్నతాధికారుల వేధింపులు భరించకలేక ఆత్మహత్య

జేబులో సూసైడ్ నోట్: ఉన్నతాధికారుల వేధింపులు భరించకలేక ఆత్మహత్య

నల్గొండ జిల్లా: ఉన్నతాధికారుల వేధింపులు భరించక ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం నల్గొండ జిల్లాలో జరిగింది. కట్టంగూరు మండలం, ముత్యాలమ్మ గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మగూడానికి చెందిన  మధు సూదన్ అనే వ్యక్తి ..నల్గొండ జిల్లా అటవీశాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా డ్యూటీ చేస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో మధు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపిన పోలీసులు.. మధు జేబులో సూసైడ్ నోట్ ఉందని.. అందులో ఉన్నతాధికారుల వేధింపులే వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉందన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.