రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సుధాకర్, శ్రావణ్ కుమార్ పిటిషన్లు వేశారు. పిల్ విచారణను స్వీకరించిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఆసరా కల్పిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల కోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు... వరదల కోసం ఎందుకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించింది.

వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను రక్షించాలని ఆదేశించింది. ఇప్పటివరకు డిజాస్టర్ చట్టప్రకారం ఎంతమందిని రక్షించారని అడిగింది. 

AsloRead:మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ చార్జ్ గా కల్వకుంట్ల వంశీధర్ రావు.. కొత్త కమిటీ ప్రకటన

వర్షాలు, వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం రోజు (జులై 31న) ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారాని (జులై 31కి వాయిదా వేసింది న్యాయస్థానం.