మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ చార్జ్ గా కల్వకుంట్ల వంశీధర్ రావు.. కొత్త కమిటీ ప్రకటన

మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ చార్జ్ గా కల్వకుంట్ల వంశీధర్ రావు.. కొత్త కమిటీ ప్రకటన

హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడంపై కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ చార్జ్ గా కల్వకుంట్ల వంశీధర్ రావును నియమించారు. 

AsloRead:ఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా... రీల్స్ కోసం బిడ్డను అమ్ముకున్నారు

సీఎం కేసీఆర్‌.. ఏకంగా 15 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. గత నెల మహారాష్ట్రలో 3 రోజుల పాటు పర్యటించిన సీఎం కేసీఆర్‌.. శుక్రవారం (జులై 28న) బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కమిటీని ప్రకటించారు.