ముంబై: ఇంగ్లండ్తో టీ20 సిరీస్ జట్టులో మనీశ్ పాండే, సంజూ శాంసన్కు చోటు దక్కకపోవడంపై వెటరన్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సీరియస్ అయ్యాడు. వీళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. అదే టైమ్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాకు తొలిసారి టీమిండియాలో ఆడే చాన్స్ రావడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో ఆడిన మనీశ్ను పక్కనబెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన చోప్రా.. అతడి కెరీర్ ప్రమాదంలో ఉందన్నాడు.
‘లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్లో టీమిండియాలో మనీశ్ పాండే పేరు ఉంటుంది. కానీ ఈసారి అతడి పేరు లేకపోవడంతో షాకయ్యా. టీమ్లో ఉన్నప్పుడు కూడా అతడికి ఎక్కువ అవకాశాలు రాలేదు. దీన్ని బట్టి అతడి కెరీర్ ప్రమాదంలో పడిందని అనిపిస్తోంది. మనీశ్తోపాటు సంజూ శాంసన్కు టీమ్లో ప్లేస్ దక్కలేదు. శాంసన్కు కొన్ని అవకాశాలు దక్కాయి. కానీ అతడు సరిగ్గా వినియోగించుకోలేదు. అయితే సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాటియాకు జట్టులో చోటు దక్కడం నాకు సంతోషాన్ని ఇచ్చింది’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.