అరఎకరం భూమి కోసం కన్న తండ్రిని చంపిన కొడుకు

అరఎకరం భూమి కోసం కన్న తండ్రిని చంపిన కొడుకు

వనపర్తి జిల్లాలోని పుల్గర్ చర్ల గ్రామంలో దారుణం జరిగింది. అరఎకరం భూమి కోసం కన్న తండ్రిని రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు కొడుకు. చిన్న కిష్టన్నకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు పదేళ్ల క్రితం చనిపోయాడు.

పెద్దకుమారుడు మద్దిలేటి ఊర్లోనే ఉండి 7ఎకరాల భూమి సాగుచేస్తున్నాడు. తండ్రి పేరున ఉన్న అర ఎకరం ఇవ్వాలని తండ్రితో గొడవకు దిగాడు. మద్యమత్తులో ఉన్న మద్దిలేటి తండ్రిని రాయితో కొట్టిచంపాడు.