ఘోరం ప్రమాదం..బస్సు టైర్ కింద పడి యువకుడి మృతి..

ఘోరం ప్రమాదం..బస్సు టైర్ కింద పడి యువకుడి మృతి..

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి హెచ్ఎంటీ గ్రౌండ్ సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఆజాద్, ప్రవీణ్ అనే ఇద్దరు యువకులు బాల నగర్ నుండి జిన్నారం వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జీడిమెట్ల పీఎస్ పరిధిలోని హెచ్ఎంటీ గ్రౌండ్ సమీపంలో ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బైక్ తో ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు.

 ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడింది. వెనక కూర్చున్న ప్రవీణ్ బస్సు టైర్ల కింద పడ్డాడు. దీంతో  ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుప్తున్న అజాద్  కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపడుతున్నామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.