పెరిగిన ఇండ్ల అమ్మకాలు

పెరిగిన ఇండ్ల అమ్మకాలు

న్యూఢిల్లీ:  ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో ఎనిమిది నగరాల్లో మొత్తం 80,250 ప్రాపర్టీ యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్​లో 74,320 యూనిట్లు అమ్ముడయ్యాయి. రెసిడెన్షియల్ యూనిట్లు  కొత్త సరఫరాలు 11 శాతం పెరిగాయి. అమ్మకాలు ఎనిమిది శాతం  వార్షిక వృద్ధిని సాధించాయని ప్రాప్​టైగర్​ డేటా తెలిపింది. ఈ సంస్థ రిపోర్టుల్లోని మార్కెట్లలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ-–ఎన్​సీఆర్​,  పూణే ఉన్నాయి.  

2023 క్యూ2లో మొత్తం అమ్మకాలలో 61 శాతం వాటా ముంబై,  పూణే నుంచి ఉండటం విశేషం. అయితే అహ్మదాబాద్​, పూణేలో మాత్రమే అమ్మకాలు పెరగగా, మిగతా నగరాల్లో తగ్గాయి.  ఈ క్వార్టర్​లో రియల్టర్లు 1,13,770 రెసిడెన్షియల్ యూనిట్లను ప్రారంభించారు. 2022 ఏప్రిల్-–జూన్ క్వార్టర్​లో అందుబాటులోకి వచ్చిన1,02,140 యూనిట్లతో పోలిస్తే సరఫరాలో 11 శాతం పెరుగుదల ఉంది. కొత్త సరఫరాల్లో ముంబై ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత పూణే,  అహ్మదాబాద్ ఉన్నాయి. రెపోరేటు పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రాపర్టీలను కొనుగోలు చేయడం పెరిగిందని ప్రాప్​టైగర్​ తెలిపింది.

ఎత్తైన భవనాలు ముంబైలోనే ఎక్కువ...

భారతదేశంలోని ఎత్తైన భవనాలలో 77శాతం ముంబైలో  ఉన్నట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ  వెల్లడించింది. ఇది ఇక నుంచి కూడా నంబర్​వన్​గా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఇది ఇతర నగరాలతో పోల్చితే ఇక్కడ ధరలు చాలా ఎక్కువ. అందుకే ముంబైలో బిల్డింగుల ఎత్తు  ఎక్కువగా ఉంటుందనీ సీబీఆర్​ఈ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా, అత్యధిక ఎత్తైన భవనాలు ఉన్న నగరాల్లో ముంబై 17వ స్థానంలో ఉంది. ఆసియాలో 14వ స్థానంలో ఉంది. 150మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నదానిని ‘టాల్ ​బిల్డింగ్​’ కేటగిరీలో చేర్చుతారు.  ఇతర నగరాలలో, హైదరాబాద్, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా,  నోయిడాలలో వరుసగా 8 శాతం, 7 శాతం  5 శాతం ఎత్తైన భవనాలు ఉన్నాయి. గుర్గావ్, బెంగళూరు,  చెన్నైలు తరువాతి స్థానాల్లో ఉన్నాయని సీబీఆర్​ఈ పేర్కొంది.