తొర్రూరులో కేసీఆర్​కు ఘన స్వాగతం

తొర్రూరులో కేసీఆర్​కు ఘన స్వాగతం

తొర్రూరు, వెలుగు: కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా వరంగల్ నుంచి ఖమ్మం ఎంపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్తున్న క్రమంలో సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్​ లీడర్లు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు పూలు చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేశారు.