నడిరోడ్డులో ఓ మహిళ ఇద్దరు యువకులపై దాడికి దిగింది. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రధాన చౌరస్తా నడిరోడ్డులో ఇద్దరు యువకులు బైక్ మీద వెళ్తూ.. అటుగా వస్తున్న ఓ మహిళపై అసభ్యకర కామెంట్ చేశారు. దాంతో ఆగ్రహించిన ఆమె యువకులను అడ్డుకొని.. వారిని చెప్పుతో చితకబాదింది. జుట్టు పట్టుకొని మరీ ఉతికారేసింది.
అక్కడున్న వారు మహిళను అడ్డుకొని సర్దిచెప్పినా ఆమె శాంతించలేదు. ఆ ఆకతాయిలకు తగిన బుద్ది చెప్పింది. మహిళ చెప్పుతో కొడుతూ తన్నుతుండగా సమీపంలోని షాప్ యజమాని దీనిని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియె సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.