బస్సు ఎక్కుతూ జారి పడి మహిళ మృతి

బస్సు ఎక్కుతూ జారి పడి మహిళ మృతి

ముషీరాబాద్,వెలుగు :  బస్సు ఎక్కుతూ కాలు జారి కిందపడి మహిళ మృతి చెందిన ఘటన నల్లకుంట పీఎస్ పరిధిలో జరిగింది. నల్లకుంట పోలీసులు తెలిపిన ప్రకారం.. గురువారం సాయంత్రం గన్ల లలిత (50), అడిక్ మెట్ బస్టాప్ వద్ద అఫ్జల్ గంజ్ నుంచి కుషాయిగూడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు  కాలుజారి బస్సు వెనుక టైర్ల కింద పడి మృతి చెందింది.

సమాచారం అందడంతో పోలీసులు  ఘటనాస్థలానికి వెళ్లి డెడ్ బాడీని  స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కొరకు గాంధీ హాస్పిటల్ తరలించారు. మృతురాలి భర్త గన్ల వెంకటస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లకుంట పోలీసులు తెలిపారు.