ఢిల్లీ మెట్రోలో ప్రయాణం అంటే బాబోయ్ అంటున్నారు. దేశరాజధాని మెట్రోలో నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. అసభ్యకరంగా ప్రవర్తించడం... కొట్టుకోవడం.. గొడవలు పెట్టుకోవడం.. రీల్స్ చేయడం ఇలా లా తరచూ ఎన్ని దారుణాలు జరుగుతున్నా.. కఠిన శిక్షలు అమలులోకి తెస్తున్నా కూడా ఢిల్లీ వాసుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ పేరు వింటే ముందుగా గుర్తు వచ్చేది మెట్రో మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం ఢిల్లీ మెట్రో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. గత కొంత కాలంగా ఏదో ఒక వివాదంతో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంది. అసభ్యకరమైన ప్రవర్తన, బికినీలు ధరించడం, ఫ్యాషన్ షో, రీల్స్, అబ్బాయి అమ్మాయికి ముద్దులు పెట్టడం, గొడవలు, కొట్లాట వంటి అనేక వివాదాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పడు ఓ మహిళ మెట్రోలో ఏకంగా ఓ వ్యక్తి ఒళ్లోనే కూర్చునేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీ రద్దీతో ప్రయాణిస్తున్న ఢిల్లీ మెట్రో రైలులో ఓ మహిళ సీటు కోసం గలాటకు దిగింది. ఏకంగా ఓ వ్యక్తి ఒళ్లోనే కూర్చునేందుకు ప్రయత్నించింది. మొదటగా అక్కడ చాలా మంది యువకులు కూర్చుని ఉన్నారు. ఓ వ్యక్తిని పక్కకు జరగమని చెప్పి వెంటనే వారి మధ్య కూర్చోడానికి ప్రయత్నించగా.. ఓ వ్యక్తి ఓళ్లో కూర్చుంది. దీంతో అతడు వెంటనే పక్కకు లేచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఢిల్లీ మెట్రోలో ఇక మార్పు రాదా అని మండిపడుతున్నారు.
#delhimetro
— Yug (@mittal68218) April 21, 2024
दिल्ली मेट्रो में महिला को सीट न मिली तो आदमी के गोद में बैठ गई। वीडियो हुआ वायरल pic.twitter.com/pTb7dMHAbQ