జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న మహిళ

జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న మహిళ

తిరుమలలో వైఎస్ జగన్ కు ఊహించని పరిణామం ఎదురైంది.  శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం జగన్  విమానాశ్రాయానికి బయలుదేరుతుండగా..ఆయన కాన్వాయ్ కు ఓ మహిళ అడ్డుపడింది. వెంటనే అలర్టైన సెక్యూరిటి సిబ్బంది ఆమెను పక్కకు లాగారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇదంతా చూస్తున్న జగన్ తన  సిబ్బందిని  నిలువరించారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ మహిళ తాను తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మహిళనంటూ, తన భర్తకు ఉద్యోగం కావాలంటూ జగన్ ఎదుట కన్నీరు పెట్టింది. ఆమె మాటలకు జగన్.. తమ ప్రభుత్వ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని, ఎవరు ఎటువంటి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.