ముంబై: ఓ మహిళతో సహజీవనం చేస్తున్న యువకుడిని ఆమె సోదరులు సుత్తితో కొట్టి చంపారు. డెడ్ బాడీని నదిలో పడేశారు. మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఈ దారుణం జరిగింది.
జిల్లాలోని కల్యాణ్ సిటీకి చెందిన ముంతాజ్ కు పెండ్లయి విడాకులు అయ్యాయి.
అయితే ఆమెతో షెబాజ్ షేక్(28) అనే వ్యక్తి నాలుగేండ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో షెబాజ్ షేక్ను చంపాలని ముంతాజ్ అన్నలు షోయబ్ షేక్, ఇర్షద్ షేక్ నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం హేమంత్ బిచ్వాడే అనే మరో వ్యక్తితో కలిసి ప్లాన్ వేశారు. షెబాజ్ను సుత్తితో కొట్టి చంపి, దగ్గర్లోని ఉల్హాస్ నదిలో పడేశారు. పోలీసులు విచారించి ముంతాజ్ సోదరులే అతణ్ని చంపారని తేల్చారు.