- మైనర్లకు మందు దొరక్కుండా చేసేందుకు దారిదే: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖపట్నం: ఏపీలో మద్య నిషేదానికి అన్ని వర్గాల నుంచి సహకారం అవసరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు. తమ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పారాయన. మద్య నిషేధం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గినే లెక్క చేయబోమని అన్నారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.
మద్యం తాగితే మనిషిలో పశుత్వం నిద్రలేస్తుందని అన్నారు అవంతి శ్రీనివాస్. మద్యం ఆగిపోతే ప్రజల ఆరోగ్యం బాగుపడడంతో పాటు నేరాలు కూడా తగ్గుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మద్య నిషేధానికి అందరూ సహకరించాలన్నారు. బ్లాక్లో మద్యం విక్రయాలు జరగకుండా అధికారులు నిఘా పెట్టాలని సూచించారు. అలాగే మైనర్లకు మద్యం అందకుండా చేసేందుకు లిక్కర్ సేల్స్కు ఆధార్ అనుసంధానం చేస్తే మేలని అన్నారాయన.