భూమి కాజేశారని మహిళ ఆత్మహత్య యత్నం

భూమి కాజేశారని మహిళ ఆత్మహత్య యత్నం

రంగారెడ్డి జిల్లా కలక్టరేట్ కార్యాలయంలో కలకలం చోటుచేసుకుంది. తమ భూమిని ధరణి నుండి తొలగించారని జయశ్రీ అనే బాధిత మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. అదనపు కలెక్టర్ ముందే బ్లేడ్ తో కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ బోయింది. దీంతో అక్కడే ఉన్న సెక్యురిటి బ్లేడ్ గుంజుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నా రు. 

బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కావాడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 67 సర్వే నంబర్ లో 1.35 ఎకరాల తమ భూమిని జనచైతన్య, శ్రీజ వెంచర్ యజమానులు భూమిని అమ్మాలని గతంలో ఒత్తిడి చేసారని తెలిపింది. అయితే తాము భూమిని అమ్మకపోవడంతో రెవెన్యూ అధికారులతో కలిసి తమ భూమిని కాజేశారని మహిళ ఆరోపించింది. దీంతో రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతి రావు తగు విచారణ జరుపుతామని సదరు మహిళకు హామీ ఇచ్చారు.