జిగిత్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో..

జిగిత్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో..

ఏసీబీ అధికారులు ఎన్ని రైడ్లు చేస్తున్నా.. ఎంత మందిని పట్టుకుంటున్నా కొందరి తీరు మారటం లేదు. ఏ పని చేయాలన్నా లంచం కావాలంటూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మంగళవారం (జూన్ 3) జగిత్యాల జిల్లాలో అవినీతి అధికారిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారో ఏసీబీ అధికారులు. 

మంగళవారం రాయికల్ ఎమ్మార్యో కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడులలో ఇంఛార్జి తహషీల్దార్ గణేష్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. 

సింగర్రావుపేట గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తిని పదివేలు డిమాండ్ చేయటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు రవి. భూమార్పిడి విషయంలో పదివేలు ఇస్తేనే పని జరుగుతుందని డిమాండ్ చేశాడు ఎమ్మార్వో. దీంతో ఏసీబీ నిఘా ఉంచి లంచం తీసుకుండగా పట్టుకున్నారు. ఇంచార్జ్ ఎమ్మార్వో గణేష్ డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ ను కూడా అరెస్ట్ చేశారు అధికారులు.