శివబాలకృష్ణ కేసు .. 2 కోట్ల 70 లక్షలు సీజ్ చేసిన ఏసీబీ

శివబాలకృష్ణ కేసు .. 2 కోట్ల 70 లక్షలు సీజ్ చేసిన ఏసీబీ

అక్రమాస్తు లకేసులో  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ భాగోతాలు రోజుకోటి బయటపడుతున్నాయి. విచారణలో తవ్వే కొద్దీ ఆస్తులు, బినామీలు బయటపడుతున్నారు. 

శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో..దర్యాప్తు స్పీడప్ చేశారు ఏసీబీ అధికారులు. దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన డబ్బులను సీజ్ చేసింది ఎసీబీ. శ్రీకృష్ణ కన్స్ స్ట్రక్షన్స్ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు రెండు కోట్ల 70 లక్షల రూపాయల నగదు చెల్లించారు బాలకృష్ణ. ఆ మొత్తాన్ని సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు అధికారులు. బినామీల పేర్లతో భారీగా ఆస్తులపై ఆరాదీస్తున్నారు.  శివబాలకృష్ణ పలు కన్స్ట్రక్షన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులపై  ఏసీబీ దృష్టిపెట్టింది.