జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

రూ.8 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తుకారాం

కుత్బుల్లాపూర్‌: జీడిమెట్ల విధ్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శివ అనే కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటున్న ఆర్టిజన్ తుకారామ్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ ఫైలును తొక్కిపెట్టిన తుకారం ఏ విషయం చెప్పకుండా వేధించాడు. మధ్య వర్తి ద్వారా లంచం కోసం వేధించాడు. చివరకు కాంట్రాక్టర్ వద్ద 8 వేలు తీసుకునేందుకు అంగీకరించాడు. దీంతో బాధిత కాంట్రాక్టర్ శివ వెళ్లి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారిచ్చిన నగదు తీసుకుని ఇవాళ జీడిమెట్ల కార్యాలయానికి చేరుకున్నాడు. ఆర్టిజన్ తుకారం లంచం డబ్బును తీసుకుని జేబులో పెట్టుకున్న వెంటనే అక్కడే మఫ్టీలో మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి హ్యాండ్సప్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది లంచం డబ్బును తీసుకుని కెమికల్ టెస్ట్ చేశారు. పాజిటివ్ గా రావడంతో లంచం తీసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే మరో బృందం ఏసీబీ అధికారులు తుకారాం ఇళ్లలో కూడా తనిఖీ చేపట్టారు.