హుజూర్నగర్ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ సోదాలు..రెడ్హ్యాండెడ్గా చిక్కిన భూభారతి ఆపరేటర్

హుజూర్నగర్ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ సోదాలు..రెడ్హ్యాండెడ్గా చిక్కిన భూభారతి ఆపరేటర్

సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుబడ్డారు భూభారతి ఆపరేటర్. శనివారం (జూన్​28) జిల్లాల్లోని హుజూర్ నగర్​ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భూమిమ్యుటేషన్​ విషయంలో డబ్బులు చేసిన భూభారతి ఆపరేటర్ విజేతరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

భూమి మ్యుటేషన్​ కు ఓ రైతునుంచి 20వేలు లంచం డిమాండ్​ చేయగా రూ. 12వేలు ఇచ్చేందుకు అంగీకారం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ ఆశ్రయించాడు బాధిత రైతు. బాధితుడినుంచి రూ. 12వేలు లంచం తీసుకుంటుండగా భూభారతి ఆపరేటర్​ విజేత రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. 

హుజూర్​నగర్​ మండలం కరక్కాయలగూడెంకు చెందిన రైతు తోట రాంబాబు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వమించారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరు మీద మ్యుటేషన్ కి చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. 

ప్రొసీడింగ్ పత్రాలను అందించే విషయంలో రైతు నుంచి 20వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు హుజూర్ నగర్​ ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ కేసు సంబంధించి ఎవరిదైనా పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ఏసీబీ డీఎస్పీ.