మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కానున్న నిందితులు

మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కానున్న నిందితులు

మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక నిందితులుగా ఉన్న  కలాహర్ రెడ్డి, హిటాచి సాయి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్యలను మరోసారి నార్కోటిక్ బృందం విచారించనుంది.  2023 అక్టోబర్ 02న ఈ ముగ్గురు నిందితులు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో  విచారణకు హాజరు కానున్నారు.  డ్రగ్స్ కేసు నిందితులుగా ఉన్న వీరిని ప్రతీ సోమవారం పోలీసుల విచారణకు హజరు కావలని  తెలంగాణ హైకోర్టు సూచించింది.    

గత నెల  సెప్టెంబర్ 26న గుడిమల్కాపూర్ పోలీసుల ఎదుట ఈ ముగ్గురు నిందితులు లొంగిపోయారు.  పోలీస్ స్టేషన్ లోనే వీరిని సుమారుగా 5 గంటల పాటు నార్కోటిక్ డీఎస్పీ నర్సింగ్ రావు విచారించారు.  పోలీసుల ఎదుట లొంగిపోయిన రోజే పోలీస్ స్టేషన్ లో కలహర్ రెడ్డి హంగామా  చేశారు. మీడియా అంతు చూస్తానంటూ  బెదిరింపులకు దిగాడు. 

Also Read :- ఊరేగింపుకొచ్చి ఫోన్లు పోగొట్టుకున్నరు

సినీ ఇండస్ట్రీలో స్క్రిప్ట్, రైటర్, షల్ వి మీట్ .. అనే కోడ్ లాంగ్వేజ్ తో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరికొంత మంది డ్రగ్స్ కన్జ్యూమర్స్ కు నోటీసులు జారీ చేశారు. హీరో నవదీప్ ను ఆరు గంటల పాటు విచారించారు. నవదీప్ 40 మంది డ్రగ్ కన్జూమర్స్ పేర్లను చెప్పినట్లు సమాచారం.