డైరెక్టర్ తేజ(Teja) తెరకెక్కించిన అహింస (Ahimsa)మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి సురేశ్బాబు రెండో తనయుడు అభిరామ్ (Abhiram). ఫస్ట్ మూవీతోనే విభిన్నమైన డైరెక్టర్ తేజ చేతిలో పడటంతో..సక్సెస్ అందుకుంటాడని ఫ్యాన్స్ భావించిన అది జరగలేదు. ప్రసెంట్ అభిరామ్ బిజినెస్పై ఫోకస్ పెట్టారు.
లేటెస్ట్గా రైటర్స్ కేఫ్(Writers Cafe) పేరుతో హైదరాబాద్లో ఓ కేఫ్ ను స్థార్ట్ చేశాడు. ఈ రైటర్స్ కేఫ్ అనేది.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకునే యంగ్ రైటర్స్కు తన వంతు సాయం చేయడం కోసమే.. ఈ కేఫ్ను స్టార్ట్ చేసినట్టు అభిరామ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. రీసెంట్ గా అభిరామ్ ను ఇంటి నుంచి గెంటేసాడని వస్తున్న వార్తలపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
'జీవితం అంటే అంత ఈజీ కాదు..తాతయ్య చనిపోయిన తర్వాత..నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. ఇకపై నా కాళ్లపై నేను నిలబడాలనుకుంటున్న.. బాధ్యతగా ఉండాలని నిర్ణయించుకున్నా.. కనుకే ఈ రైటర్స్ కేఫ్ స్టార్ట్ చేశా. ఈ కేఫ్ స్టార్ట్ చేయడం వల్ల.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్లు ..వచ్చిన పుకార్లలో వాస్తవం లేదని' క్లారీటి ఇచ్చారు.
అహింస మూవీకు సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి ప్రశంసలు వచ్చినప్పటికి..సరిగా ఆడకపోవడం కాస్త ఇబ్బంది పెట్టింది. ఇప్పటికీ కొంత మంది డైరెక్టర్స్ వచ్చి కథలు వినిపించారు. అయితే, ఒక యాక్టర్ గా నేనింకా ఎంతో నేర్చుకోవాలని అర్థమైంది. అందుకే కాస్త టైం తీసుకుని..సినిమాలు చేయడానికి ముందుకు వస్తానంటూ దర్శక-నిర్మాతలకు చెప్పానని తెలిపారు. ఫ్యూచర్ లో లవ్ స్టోరీస్ పై ఫోకస్ చేయాలని డిసైడ్ అయిన్నట్లు ఇంటర్వ్యూలో అభిరామ్ పేర్కొన్నారు.