హీరో దర్శన్.. సినిమా స్టయిల్ లో కరెంట్ షాక్ ఇచ్చి చంపారు

హీరో దర్శన్.. సినిమా స్టయిల్ లో కరెంట్ షాక్ ఇచ్చి చంపారు

కన్నడ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసిన రేణుకాస్వామి హైప్రొఫైల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేణుకాస్వామి చనిపోవడానికి ముందు అతన్ని కరెంట్ షాక్ పెట్టి  చిత్రహింసలకు గురిచేసినట్లుగా పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది.  అంతేకాకుండా రేణుకాస్వామిని  కర్రలు, పైపులు, బెల్టుతో కొట్టినట్టు శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. షెడ్డులో దొరికిన షూస్, బట్టలను సీజ్ చేసిన పోలీసులు.. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపించారు.  పోస్ట్‌మార్టం రిపోర్టులో రేణుకాస్వామి శరీరంపై 15 తీవ్రమైన గాయాలు ఉన్నాయని, అందులో విద్యుత్ షాక్‌ను సూచించే కాలిన గాయాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది

ఈ హత్య కేసులో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ సహా 17 మందిని అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. ప్లాన్ ప్రకారమే రేణుకా స్వామిని దర్శన్ హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రేణుకా స్వామి డెడ్​బాడీ తరలించేందుకు ఉపయోగించిన స్కార్పియో కారులో దర్శన్ ఫొటో ఉందని చెప్తున్నారు. దానిని నిందితులు తొలగించారని ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన రికార్డుల్లో కారు ఫొటో క్యాప్చర్ అయిందని తెలిపారు.  

చిత్రదుర్గ జిల్లాలో ఉండే  రేణుకాస్వామి నటుడు దర్శన్‌ అభిమాన సంఘం సభ్యుడు, ఆటో  డ్రైవర్‌ గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక హీరో దర్శన్, పవిత్ర గౌడ పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో  రేణుకస్వామి...  నటి పవిత్రగౌడపై అసభ్యకరమైన కామెంట్లు చేశాడని..  30 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి.. తన ఫ్యాన్స్ సంఘంలోని సభ్యులతోనే రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి చంపించాడు దర్శన్.   బెంగళూరు సమీపంలో అతని డెడ్ బాడీ దొరికింది.