డ్రగ్స్ కేసులో రేపు ఈడీ విచారణకు నవదీప్

డ్రగ్స్ కేసులో రేపు ఈడీ విచారణకు నవదీప్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో రేపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు నటుడు నవదీప్ హాజరుకానున్నారు. ఈయనతోపాటు ఎఫ్ఎం క్లబ్ జనరల్ మేనేజర్ ను కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తెలుగు సినీ ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేసిన డ్రగ్స్ కేసుకు తోడు.. తాజాగా  మనీ లాండరింగ్ కోణం విచారణ తెలుగు సినీ ప్రముఖులను విచారణకు హాజరవుతుండడం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటి వరకు ఏడుగురు సినీ ప్రముఖులను విచారించిన ఈడీ రేపు నటుడు నవదీప్ ను ప్రశ్నించనుంది. ముఖ్యంగా కెల్విన్ తో లావాదేవీల గురించి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.